పెరగనున్న స్కోడా ధరలు

22 Feb, 2018 00:36 IST|Sakshi
స్కోడా ఆటో ఇండియా

న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతోంది. బడ్జెట్లో కస్టమ్స్‌ సుంకాలను పెంచడంతో అన్ని మోడళ్ల ధరలను 1 శాతం వరకూ (రూ.10,000 నుంచి రూ.35 వేల వరకూ) పెంచుతున్నామని తెలిపింది.  దశల వారీగా కార్ల ధరలను మరింతగా పెంచుతామని పేర్కొంది.

మోడళ్లను బట్టి భవిష్యత్తులో ధరల పెంపు 3 నుంచి 4 శాతం రేంజ్‌లో ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ రూ.8.32 లక్షల ఖరీదు చేసే మిడ్‌ సైజ్‌ సెడాన్‌ రాపిడ్‌ నుంచి రూ.34.5 లక్షలు ధర ఉండే ఎస్‌యూవీ కోడియాక్‌ వరకు మోడళ్లను విక్రయిస్తోంది.  

మరిన్ని వార్తలు