స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసిన అరిసెంట్

12 Aug, 2015 02:37 IST|Sakshi
స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసిన అరిసెంట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ డిజైన్ సేవల సంస్థ అరిసెంట్.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీ కండక్టర్లు, సాఫ్ట్‌వేర్ సిస్టమ్ డిజైన్ కంపెనీ స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. స్మార్ట్‌ప్లే కొనుగోలుతో సెమీ కండక్టర్ల ఇంజనీరింగ్ సర్వీస్ విభాగంలో నంబర్1 స్థానంలో నిలవాలనేది తమ లక్ష్యమని అరిసెంట్ సీఈఓ ఫ్రాంక్ కెర్న్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ప్లే కో-ఫౌండర్, సీఈఓ ప్రదీప్ వజ్రం ఇకపై అరిసెంట్ సెమీ కండక్టర్ యూనిట్‌కి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు