సుజుకీ.. రెండు ఆఫ్‌రోడ్‌ బైక్‌లు

4 Oct, 2018 00:59 IST|Sakshi

ఆర్‌ఎం–జెడ్‌ 250ఃరూ.7.10 లక్షలు 

ఆర్‌ఎం–జెడ్‌ 450ఃరూ.8.31 లక్షలు

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా భారత మార్కెట్‌లో రెండు గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం–జెడ్‌ 250 పేరిట విడుదలైన బైక్‌ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం–జెడ్‌ 450 మోడల్‌ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్‌–రోడింగ్‌ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్‌ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు