సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు

6 Jun, 2016 01:12 IST|Sakshi

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 9వ సీజన్‌లో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్(ఎస్‌పీఎన్) ఇండియా కంపెనీ రూ.1,200 కోట్ల ప్రకటనల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఆదాయం(రూ.1,000 కోట్లు)తో పోల్చితే 20% వృద్ధి చెందింది. ప్రకటనల రేట్లు 15% పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధించామని ఎస్‌పీఎన్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా చెప్పారు.

మరిన్ని వార్తలు