13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్

9 Jun, 2016 01:29 IST|Sakshi

ముంబై: మొదటి విడత జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 13వ తేదీ (సోమవారం) నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 నవంబర్ 30న జారీ చేసిన బాండ్లు సోమవారం నుంచీ ట్రేడవుతాయని, తరువాతి తేదీల్లో జారీ చేసిన బాండ్ల ట్రేడింగ్ తేదీలను తరువాత నోటిఫై చేస్తామని కూడా ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకూ మూడు విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. త్వరలో నాల్గవ విడతను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బాండ్లపై వార్షిక వడ్డీరేటు 2.75 శాతం.

మరిన్ని వార్తలు