వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

9 Nov, 2019 05:49 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్‌ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం...  
►నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  బ్యాంక్‌ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి.  
►ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 8 శాతానికి దిగి వచ్చింది.  
►ఇక టర్మ్‌ డిపాజిట్‌ రేట్లనూ బ్యాంక్‌ తగ్గించింది.  రెండేళ్ల వరకూ రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌పై రేటు 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. బల్క్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు అన్ని కాల వ్యవధులపై 30 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గింది.   

మరిన్ని వార్తలు