భారీగా పతనమైన మార్కెట్లు

11 Feb, 2016 16:16 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 807 పాయింట్లు కోల్పోయి 22,951 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 6976 వద్ద ముగిసింది.

సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రోజు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. నష్టాల దిశగా పయనిస్తూ భారీ నష్టాలతో ముగిశాయి.

మరిన్ని వార్తలు