సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయ అనంతరం మరింత పుంజకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 207 పాయింట్లు ఎగిసి 34145 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు ఎగిసి 10100 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 34వేల ఎగువన, నిఫ్టీ 10100 ఎగువన స్థిరంగా ఉన్నాయి. పార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఆర్ బీఎల్, అశోక్ లేలాండ్, భారతి ఎయిర్ టెల్ , ఆసియన్ పెయింట్స్ లాభపడుతుండగా వొడాఫోన్, మదరన్స్ సుమీ తదితర షేర్లు నష్టపోతున్నాయి.