ముంబై : స్టాక్ మార్కెట్లలో మోదీ మానియా కొనసాగుతోంది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో లాభాల బాట పట్టిన మార్కెట్లలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. కొనుగోళ్ల వెల్లువతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12వేల పాయింట్ల మార్క్ను క్రాస్ చేయగా, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. పలు రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కోల్ ఇండియా, ఐడియా సెల్యులార్, హెచ్పీసీఎల్, అదానీ పవర్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర తదితర షేర్లు భారీగా లాభపడుతున్నాయి.