నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు: పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

20 Mar, 2018 09:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 26 పాయింట్ల నష‍్టంతో 32,896వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 10077 వద్ద ట్రేడ​ అవుతోంది. ఒకదశలో 10050 స్తాయిని కోల్పోయిని నిఫ్టీ ఆ తరువాత కోలుకుంది. అయితే మార్కెట్లో అమ్మకాల  వెల్లువ కొనసాగుతోంది.  పీఎస్‌యూబ్యాకింగ్‌ నష్టాలు ఈ వరుసగా నాలుగో సెషన్లో మంగళవారం కూడా  కొనసాగుతున్నాయి.  ఐడీబీఐ భారీగా నష్టపోతోంది. వేదాంతా,  సన్‌ఫార్మ, యూనియన్‌ బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందాల్కో , మారుతి, బీఈఎంల్‌,  ఐవోసీ, బయోకాన్‌ నష్టపోతుండగా భారతి ఇన్‌ప్రాటెల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభపడుతోంది. 

మరిన్ని వార్తలు