లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

31 Jul, 2019 14:33 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుస నష్టాలనుంచి కోలుకున్న  సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత ఎగిసాయి.  ప్రసుతం సెన్సెక్స్‌ 123  పాయింట్లు  పుంజుకుని 37523 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 11127 వద్ద కొనసాగుతున్నాయి. 

మీడియా, రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌   సెక్టార్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.  నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, హీరో మోటో, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌ టాటా మోటార్స్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, బ్రిటానియా, అల్ట్రాటెక్, బజాజ్ ఫిన్‌సర్వ్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు