నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

13 Aug, 2019 09:36 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లునష్టాల్లో ప్రారంభమైనాయి.ఆరంభం నష్టాలనుంచి వెంటనే మరింత దిగజారిన  సెన్సెక్స్‌  ప్రస్తుతం 212 పాయింట్లు నష్టంతో 37369 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టంతో 11029 కొనసాగుతోంది. జియో ఫైబర్‌ సేవలు,  సౌదీ చమురు కంపెనీ భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్‌  ఆరంభంలోనే 8 శాతం ఎగిసింది. అలాగే  బీపీసీఎల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ  టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. ఎన్‌టీపీసీ, భారతి ఎ యిర్‌టెల్‌, బ్రిటానియా, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌ , అశోక్‌ లేలాండ్‌,  పవర్‌గ్రిడ్‌ నష్టపోతున్నాయి. 

>
మరిన్ని వార్తలు