ఉత్సాహంగా సూచీలు, డబుల్‌ సెంచరీ లాభాలు 

11 Jul, 2019 15:52 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా లాభాలతో హుషారుగా సాగిన మార్కెట్లు చివరివరకూ అదే జోరును కొనసాగించాయి.  ఒకదశలో సెన్సెక్స్‌300 పాయింట్లకుపైగా ఎగిసింది.  చివరికి సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభపడి, 28823 వద్ద, నిఫ్టీ  84 పాయింట్లు లాభపడి 11582 వద్ద  ముగిసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌, మదర‍్సన్‌ సుమి,  టాటామోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్‌, టెక్‌మహీంద్ర  నష్టపోయాయి.    ప్రమోటర్ల వివాదం నేపథ్యంలోఇండిగో షేరు ఈ రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. 

మరిన్ని వార్తలు