వారాంతంలో లాభాల ముగింపు

10 Jan, 2020 15:45 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి.  ఆరంభం లాభాలను మిడ్‌  సెషన్‌లో కోల్పోయినా చివరి అర్థగంటలో భారీగా పుంజుకుని కీలక సూచీలు మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. సెన్సెక్స్‌147 పాయింట్లు లాభపడి, 41599, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 12257 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభ పడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటో రంగాలు పాజిటివ్‌గా ముగిసా​యి.  ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌  మారుతి సుజుకి, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మ, కోటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎం లాభ పడ్డాయి. యస్‌బ్యాంకు,  జీ,  ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టైటన్‌, విప్రో,  యూపీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు