చివరికి నష్టాలే

12 Jul, 2019 15:55 IST|Sakshi

సాక్షి, ముంబై : లాభనష్టాల మద్య ఊగిసలాడిన స్టాక్‌మార్కెట్లు చివరికి నష్టాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు వారాంతంలో బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్‌  87 పాయింట్లు క్షీణించి 38736 వద్ద, నిఫ్టీ 30పాయింట్లు నష్టపోయి 11552 వద్ద ముగిసాయి. ఆటో రియల్టీ లాభపడగా, బ్యాంకింగ్‌ సెక్టార్‌ నష్టపోయింది. విప్రో, ఓఎన్‌జీసీ, బజాజ్‌  ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఎల్‌ అండటీ, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంకు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. వేదాంతా, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌,  ఏషియన్‌ పెయింట్స్‌, హీరో మోటో కార్ప్‌, యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు