నష్టాల్లో సూచీలు : ఎస్‌ బ్యాంకు టాప్‌ విన్నర్‌

14 Feb, 2019 09:29 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం  బలహీనంగా ప్రారంభమయ్యాయి. 117 పాయింట్లు క్షీణించిన  సెన్సెక్స్‌ 35916 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 10758 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తద్వారా సెన్సెక్స్‌ 36వేల స్థాయిని,  నిఫ్టీ 10800 స్థాయిని కూడా కోల్పోయింది.  దాదాపు అన్ని రంగాల్లోనూ  అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

ఎస్‌ బ్యాంకు టాప్‌ విన్నర్‌గా ఉంది.  ఇండియా బుల్స్‌,  సన్‌ పార్మా,  ఐటీసీ లాభపడుతున్నాయి.  భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, అదానీ పవర్‌ నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు