ట్రిపుల్ సెంచరీ లాభాలు
బ్యాంకింగ్,ఫార్మా అండ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 366 పాయింట్లు ఎగిసి 36960 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, ఫార్మ రంగ షేర్ల లాభాలతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను మించి కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 37వేల మార్క్కు చేరువలో ఉంది.
జేఎస్డబ్ల్యూస్టీల్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, హిందాల్కో, రిలయన్స్, వేదాంతా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్ర, బయోకాన్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, డా.రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి.