లాభాల  ప్రారంభం : తప్పని ఊగిసలాట

5 Mar, 2020 09:32 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతోప్రారంభమైనాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 230 పాయింట్ల లాభంతో 38639 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో11318 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.  మిడ్‌క్యాప్‌,ఆటో,  బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి.  అయితే లాభనష్టాల సయ్యాట మాత్రం ఈ రోజు కూడా కొనసాగుతోంది. గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌,హెచ్‌యూఎల్‌, డా. రెడ్డీస్‌,హీరో మోటో లాభపడుతుండగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎం అండ్‌ ఎం, మారుతిసుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్‌, ఐటీసీ నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు