-
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 38, 292 వద్ద నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11, 565వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే. అయితే ఫార్మ, ఐటీ లాభపడుతుండగా, బ్యాంకింగ్, సెక్టార్ బాగా నష్టపోతోంది. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు లాభాలు మార్కెట్కు కొంత మద్దతు నిస్తుండగా, ఎస్బీఐ టాప్ లూజర్గా ఉంది. లుపిన్, జెఎస్ డబ్ల్యు, ముత్తూట్ ఫినాన్స్, గ్లెన్మార్క్ లాభపడుతున్నాయి. హెచ్పీసీఎల్, [ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకు, సిమెంట్ షేర్లు నష్టపోతున్నాయి.
మరోవైపు రుపీ పతనం కొనసాగుతోంది. డాలరు మారకంలో 15 పైసల నష్టంతో 72. 14 వద్ద ఉంది.