సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతోప్రారంభమైనాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 38007 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు ఎగిసి 11322 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిల పైకి చేరాయి. అయితే నిఫ్టీ బ్యాంకు, ఐటీ నెగిటివ్గా ఉంది. యస్బ్యాంకు, కెనరాబ్యాంకు, బయోకాన్ నష్టపోతుండగా , బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఇన్ప్రాటెల్, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి.