నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

21 Jun, 2019 09:37 IST|Sakshi

సాక్షి, ముంబై :   దేశీయ స్టాక్‌మార్కెట్లు   నష్టాలతో  ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 39648 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల క్షీణించి 11794 వద‍్ద కొనసాగుతున్నాయి.   బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ సెక్టార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, వేదాంతా లాభపడుతుండగా టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, యస్‌ బ్యాంకు , ఐటీసీ, నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ బలహీనంగా  ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  31 పైసలు క్షీణించి 69.75 వద్ద కొనసాగుతోంది. గురువారం 69.44 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు