సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. క్రూడ్ ధరలు దిగి రావడం, రుపీ విలువ పుంజుకోవడంతో కీలక సూచీలు పాజిటివ్గా ముగిసాయి. వరుసగా రెండో రోజు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. రోజంతా పటిష్ట లాభాలతో కదిలి ఇంట్రాడేలో 300పాయింట్లకుపైగా పుంజుకున్న సెన్సెక్స్ చివరికి 297పాయింట్లు ఎగిసి 35,162 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభపడి 10,584 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి.