సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 143 పాయింట్లుకు పైగా , నిఫ్టీ 42 పాయింట్లు మేర నష్టపోయింది. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస తప్ప దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో కొన సాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. యస్బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంతా, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, ఎండ్ ఎండ్ కోటక్ మహీంద్ర బాగా నష్టపోతున్నాయి. ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోల్ఇండియా టాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి.