హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుజన గ్రూప్కు చెందిన సుజన టవర్స్.. టవర్ల వ్యాపారం నుంచి వైదొలుగుతోంది. ట్రాన్స్మిషన్, టెలికం టవర్ బిజినెస్, ట్రాన్స్మిషన్ ఈపీసీ, ఔట్సోర్సింగ్ బిజినెస్ విభాగాలను విక్రయించాలని బోర్డు నిర్ణయించినట్టు బుధవారం కంపెనీ బీఎస్ఈకి వెల్లడించింది. ఈ వ్యాపారాలను కొనుగోలుకై హైదరాబాద్కు చెందిన అగర్వాల్ స్టీల్ స్ట్రక్చర్స్ ముందుకు వచ్చింది. మెదక్ జిల్లాలోని కంపెనీకి చెందిన నాలుగు ప్లాంట్లు 2014-15లో రూ.2,066 కోట్ల టర్నోవర్ నమోదు చేసినా లాభాలను అందించలేదని సుజన టవర్స్ వివరించింది.
రూ.2,040 కోట్ల విలువైన ఆస్తులను, రూ.1,675 కోట్ల అప్పులను అగర్వాల్ స్టీల్ స్ట్రక్చర్స్కు బదిలీ చేయనుంది. తద్వారా నికరంగా రూ.340 కోట్ల ప్రతిఫలం రావొచ్చని కంపెనీ ఆశిస్తోంది.