8+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
జియో యూజర్లకు రూ.2200 క్యాష్బ్యాక్
మొబైల్స్ తయారీదారు స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ చేసింది. కేవలం రూ.3,999 ధరకే ఈ ఎలైట్ డ్యుయల్ను తాజాగా విడుదల చేసింది. డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోన్ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ను అందిస్తోంది. అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందనేది గమనార్హం. జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్ టెక్నాలజీస్ జియో ఫుట్బాల్ఆఫర్ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్ అందిస్తోంది. బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా షాప్క్లూస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు