సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జీఎంగా ఎం.ప్రసాద్

4 Aug, 2015 00:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సిండికేట్ బ్యాంక్ శాఖల ఇన్‌చార్జ్‌గా ఎం.ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ రీజనల్ మేనేజర్‌గా ఉన్న ప్రసాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 7 రీజనల్ ఆఫీసులు, 550 శాఖలకు ఇన్‌చార్జ్‌గా ప్రసాద్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు