సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ

9 Jun, 2016 01:25 IST|Sakshi
సిండికేట్ బ్యాంక్ రూ.1,700 కోట్ల సమీకరణ

ఈ నెల 26న ఏజీఎం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్‌బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు  సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని, మొత్తం బ్యాంక్ మూలధనంలో ప్రభుత్వ వాటా 51 %కి తగ్గకుండా ఉండేలా ఈ నిధులు సమీకరిస్తామని వివరించింది.

మరిన్ని వార్తలు