-

117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి

25 Jun, 2016 01:38 IST|Sakshi
117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి

టాటా సన్స్‌కు లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు
ముంబై/టోక్యో:  జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమోకు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్‌ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో  జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్  ఆర్బిట్రేషన్ కోర్ట్  ఆదేశాలు జారీ చేసిందని ఎన్‌టీటీ డొకొమో తెలిపింది. కాగా ఆర్బిట్రేషన్ ఉత్తర్వులు అందాయని, అధ్యయనం చేస్తున్నామని టాటా సన్స్ పేర్కొంది. ప్రస్తుతానికైతే ఎలాంటి వ్యాఖ్య చేయలేమని వివరించింది.

మరిన్ని వార్తలు