టీసీఎల్ సూపర్ స్మార్ట్ టీవీలు : ధర

20 Jun, 2020 12:22 IST|Sakshi

సాక్షి, ముంబై : చైనాకు చెందిన టెలివిజన్ తయారీదారు టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. 8 కే క్యూఎల్‌ఈడీ టీవీ  4 కే క్యూఎల్‌ఈడీ టీవీలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. 8 కే క్యూఎల్‌ఈడీ 75 అంగుళాల ప్యానల్‌ను కలిగి ఉండగా, 4 కె క్యూఎల్‌ఈడీ టివి శ్రేణి ప్రీమియం, ఎంట్రీ లెవల్ కేటగిరీలో పలు స్క్రీన్ పరిమాణాలలోతీసుకొచ్చింది. వీటి ధరలు రూ .45,990 నుండి మొదలై 2,99,990 రూపాయల వరకు ఉన్నాయి.  కొత్త టీవీలు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్‌ ఫీచర్ తో రావడం విశేషం.

ఈ తాజా చేర్పులతో, ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో కొత్త  మైలురాళ్లను సృష్టించనున్నామని టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి 8 కె క్యూఎల్‌ఈడీ టీవీని తొలిసారిగా తామే లాంచ్ చేస్తున్నామన్నారు. 75 అంగుళాల ఎక్స్‌915 8 కె క్యూఎల్‌డి ఆండ్రాయిడ్ టీవీలో ఐమాక్స్ పాప్-అప్ కెమెరా, డాల్బీ విజన్ అల్ట్రా-వివిడ్ ఇమేజింగ్,  డాల్బీ అట్మోస్ ఆడియో, ఏఐ ఆధారిత 8కే ప్రాసెసర్‌ లాంటి మెరుగైన ఫీచర్లను  ఈ టీవీలలో అందిస్తామని తెలిపారు. 

8 కె క్యూఎల్‌ఈడీ 75 ఎక్స్ 915 ధర 2,99,990 రూపాయలు.

4 కె క్యూఎల్‌ఈడీ టీవీ : సీ 815, సీ  715  క్వాంటం డాట్ డిస్ ప్లే టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ.
సీ 815  4 కె క్యూఎల్‌టీవీ ప్రారంభ ధర  69,990 రూపాయలు. ఇవి 55,  65, 75 అంగుళాలల్లో లభ్యం
సీ 715 ఎంట్రీ లెవల్ 4 కె క్యూఎల్‌ఈడీ టీవీ ధర 45,990 రూపాయలు. 50, 55 65 అంగుళాలలో లభిస్తుంది.

'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో 2,400 కోట్ల రూపాయల విలువైన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్  సంవత్సరానికి  8 మిలియన్ల 22-55 అంగుళాల టీవీ స్క్రీన్‌లను, 30 మిలియన్ల 3.5-8 అంగుళాల మొబైల్ స్క్రీన్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ఇదే అతిపెద్ద ఉత్పాదక యూనిట్ అని పేర్కొంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని టీసీఎల్ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు