"ది జెయింట్'' వస్తోంది..బడ్జెట్ ధరలో

15 Jun, 2020 12:57 IST|Sakshi

సాక్షి, ముంబై : టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్  విడుదల చేయనుంది.. జూన్ 17 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు  టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఒక  టీజర్ వీడియోను షేర్ చేసింది. టెక్నో స్పార్క్ 2 ధర రూ. భారతదేశంలో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్‌లో  ప్రత్యేకంగా లభ్యం కానుంది. 10 నిమిషాల ఛార్జింగ్ తో 3 గంటల బ్యాటరీ, . బిగ్గెస్ట్  స్క్రీన్, బెస్ట్ బ్యాటరీ, స్మార్ట్ ఫోన్ అనే హ్యాష్‌ట్యాగ్ ను జోడించింది

6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ క్వాడ్ రియర్ కెమెరా,  స్టీరియో సౌండ్ స్పీకర్లు, వాటర్‌డ్రాప్-స్టైల్  నాచ్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు కొనసాగింపుగా  ఈ స్మార్ట్‌ఫోన్ ను తీసుకొస్తోంది.  టెక్నో స్పార్క్ పవర్ 2 ఇతర స్పెసిఫికేషన్స్ ఇతర ఆఫర్ వివరాలు లాంచింగ్ రోజు రివీల్ కానున్నాయి.

మరిన్ని వార్తలు