కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ తనిఖీలు...

7 Jan, 2016 01:40 IST|Sakshi
కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ తనిఖీలు...

న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కు సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ఏడు నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. టెలికం కంపెనీల సేవల నాణ్యత మెరుగుపడిందో లేదో చూడ్డానికి  ఈ పరీక్షలను ఏడు నగరాల్లో-ఢిల్లీ, ముంబై, సూరత్, కోల్‌కత, పుణే, భువనేశ్వర్, ఇండోర్‌ల్లో నిర్వహిస్తున్నామని ట్రాయ్ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత నెల 21 నుంచి మొదలైన ఈ పరీక్షలు ఈ నెల 8 వరకూ జరుగుతాయని పేర్కొన్నారు. కాగా కాల్‌డ్రాప్స్ సమస్య మెరుగుపడుతోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు