ఎయిర్‌సెల్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌

24 Apr, 2018 16:37 IST|Sakshi
ఎయిర్‌సెల్‌(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్‌ ట్రాయ్‌  (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ఎయిర్‌సెల్‌ వినియోగదారులకు ఊరటనిచ్చింది.    ఎయిర్‌సెల్‌ కస్టమర్లకు చెందిన బ్యాలెన్స్‌ నగదును, సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి  చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను ఆదేశించింది. ఈ విషయంలో వినియోగదారుల ఫిర్యాదులపై  స్పందించిన  ట్రాయ్‌ ఈ ఆదేశాలిచ్చింది.  ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ చందాదారులకు చెందిన బకాయిలు చెల్లించాలని  పేర్కొంది.  మార్చి 1 , 2017నుంచి మార్చి 18 2018 మధ్య ఈ చెల్లింపులు చేయాలని  ఆదేశించింది. అంతేకాదు ఈ చెల్లింపులకు సంబంధించి  ప్రాంతాల వారీగా  పూర్తి రిపోర్టును మే 10లోపు అందించాలని కూడా  కోరింది.

ఎయిర్‌సెల్‌ గ్రూప్ ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్‌ తెలిపింది. టెలికాం చందాదారుల ప్రయోజనాన్ని కాపాడే క్రమంలో   ఈ అదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఎయిర్‌సెల్‌నుంచి పోర్ట్‌ అయిన  ఖాతాలకు రీఫండ్‌ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని, ఈ సమాచారాన్ని  వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని కోరింది.

మరిన్ని వార్తలు