‘మొబైల్ బ్యాంకింగ్’పై ట్రాయ్ దృష్టి

3 Aug, 2016 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ బ్యాంకింగ్ వినియోగాన్ని పెంచే చర్యలపై ట్రాయ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూఎస్‌ఎస్‌డీ మెస్సేజీ ఆధారిత బ్యాకింగ్ సేవల టారిఫ్‌తోపాటు, ఈ చార్జీలను ఎవరు చెల్లించాలి...? కస్టమర్లా... లేక బ్యాంకులా? అన్న అంశాలపై ఆగస్ట్ 31లోపు ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయాలని ట్రాయ్ కోరింది. దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన0్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవలు అంతగా విస్తరించని ప్రాంతాల్లో యూఎస్‌ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మంచి ఆదరణ లభిస్తుందని ట్రాయ్ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు