ట్రాన్స్‌ట్రాయ్‌కు దేనా బ్యాంక్‌ షాక్‌

5 Jan, 2018 15:09 IST|Sakshi

సాక్షి, పోలవరం: దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌కు మరో  బ్యాంకు గట్టి షాకు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌  రుణాలు చెల్లించకపోవడంతో  దేనా బ్యాంకు అధికారులు  సంస్థకు చెందిన వాహనాలను, యంత్రాలను సీజ్‌ చేశారు.  గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు  దేనా బ్యాంకు  ఈ నిర్ణయం తీసుకుంది.

సంస్థ గతంలో తీసుకున్న రూ.87 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  ఈ చర్యకు  దిగారు.  వడ్డీతో  సహా మొత్తం రూ. 120కోట్లు బకాయిపడడంతో శుక్రవారం పోలవరం వద్దనున్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు ప్రతినిధులు కోర్టు ఆదేశాలతోనే   ఈ చర్య తీసుకున‍్నట్టు స్పష్టం చేశారు.

కాగా గతంలో కూడా  రుణాలను  (రూ.725 కోట్లు)చెల్లించాలని డిమాండ్‌  చేస్తూ  ట్రాన్స్‌ట్రాయ్‌పై కెనరా బ్యాంకు   నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది.  టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొనడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు