ట్రూజెట్‌ వార్షికోత్సవ సేల్‌

10 Jul, 2018 00:36 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ట్రూజెట్‌ మూడవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో టికెట్‌ ప్రారంభ ధరను రూ.603 నుంచి ఆఫర్‌ చేస్తోంది. బుకింగ్‌ పీరియడ్‌ జూలై 9 నుంచి 12 వరకు ఉంది. కస్టమర్లు జూలై 20 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రూజెట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 9 నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. 

మరిన్ని వార్తలు