టీవీఎస్ మోటార్ నుంచి కొత్త ‘విక్టర్’

19 Apr, 2016 01:34 IST|Sakshi
టీవీఎస్ మోటార్ నుంచి కొత్త ‘విక్టర్’

ప్రారంభ ధర రూ.49,490
న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా కొత్త అప్‌డేటెడ్ ‘విక్టర్’ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.49,490- రూ.51,490గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ బైక్‌లో అడ్వాన్స్‌డ్ త్రీ వాల్వ్ ఎకోథ్రస్ట్ ఇంజిన్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇది లీటరుకు 76 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుందని పేర్కొంది. 2002లో మొదటిసారిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విక్టర్ బైక్‌లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు స్టైలిష్‌గా, అధునాతన టెక్నాలజీతో కూడిన బైక్‌ను అందించడంలో ముందుంటామని పేర్కొంది.

మరిన్ని వార్తలు