9న యూనియన్‌ బ్యాంక్‌ బోర్డు సమావేశం

5 Sep, 2019 13:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే క్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సెప్టెంబర్‌ 9న సమావేశం కానుంది. రూ. 11,700 కోట్ల మూలధన సమీకరణ అంశంపై కూడా ఇందులో చర్చించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు బ్యాంకు తెలియజేసింది. మరోవైపు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు సెప్టెంబర్‌ 6న బోర్డు సమావేశం కానున్నట్లు యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం ఆగస్టు 30న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు