సాక్షి, హైదరాబాద్: కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ఉషా ఇంటర్నేషనల్ తాజాగా మార్కెట్లోకి కిడ్స్ ఫ్యాన్లను విడుదల చేసింది. ఈ ఫ్యాన్ల మీద బార్బీ, చోటా భీమ్, డొరేమన్ వంటి కార్టూన్ క్యారెక్టర్స్ బొమ్మలను ముద్రించి ఉంటాయి. రిమోట్ కంట్రోల్ ఆధారిత ఈ ఫ్యాన్ల ధర రూ.4,500 నుంచి ప్రారంభం. రెండేళ్ల వారంటీ ఉంటుంది. పిల్లల కళలు, అభిరుచుల ఆధారంగా 3 నుంచి 8 ఏళ్ల వయస్సు పిల్లల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించామని ఉషా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రిక్, ఫ్యాన్ అండ్ పంప్స్) రోహిత్ మథూర్ తెలిపారు. కిడ్స్ ఫ్యాన్ల విభాగంలో ప్రముఖ బ్రాండ్గా ఎదుగుతున్నామని పేర్కొన్నారు.