అద్భుతమైన పాప్‌అప్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

20 Feb, 2019 13:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వి15 ప్రొ బుధవారం భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి పాపప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో పేర్కొంది.  వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను  ధర రూ.28,990లుగా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా మార్చి 6వ తేదీనుంచి  అందుబాటులోకి రానుంది. 

వివో వి15 ప్రొ ఫీచర్లు
6.39 అంగుళాల అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా
32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా
3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ 

మరిన్ని వార్తలు