కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే

7 Mar, 2020 06:30 IST|Sakshi

ఏజీఆర్‌ బాకీలపై వొడాఫోన్‌ ఐడియా స్వీయ మదింపు

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్‌) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్‌) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా రూ. 53,000 కోట్ల పైగా కట్టాలని డాట్‌ చెబుతోంది. మరోవైపు, వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కంపెనీని నిలబెట్టేందుకు తోడ్పాటు అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు