వొడాఫోన్‌ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌, క్యాష్‌బ్యాక్‌

19 Dec, 2017 17:54 IST|Sakshi

జియో ఫోన్‌కు పోటీగా వొడాఫోన్‌, ఐటెల్‌ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏ20 పేరుతో  ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.3,690 డౌన్‌పేమెంట్‌లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2100 క్యాష్‌బ్యాక్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌చేస్తోంది. అంటే కేవలం రూ.1,590కే ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు 4జీ కనెక్టివిటీని కూడా పొందవచ్చు. అయితే క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి ఏ20 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు వరుసగా 18 నెలల పాటు రూ.150 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్‌లు చేయించుకుంటే, ఏడాదిన్నర తర్వాత రూ.900, ఆ తర్వాత ఏడాదిన్నరకు రూ.1200ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. యూజర్లు ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్‌ పేర్కొంది. 

వొడాఫోన్‌-ఇంటెల్‌ ఏ20 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు...
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమరీ
1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు