వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్

12 Aug, 2015 02:31 IST|Sakshi
వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రిచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్‌సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. సర్కిల్‌లో వొడాఫోన్‌కు 65 లక్షల మంది వినియోగదార్లుంటే, 20 లక్షల మందికిపైగా డేటా వాడుతున్నారు.

మరిన్ని వార్తలు