స్టాక్‌ మార్కెట్‌ నష్టాల బాట

4 Sep, 2019 10:56 IST|Sakshi

ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో సాగుతున్నాయి. ఆగస్ట్‌లో ఆటోమొబైల్‌ విక్రయాలు నిరుత్సాహకరంగా ఉండటం, ఆర్థిక మందగమనం భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 108 పాయింట్ల నష్టంతో 36,454 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 43 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,754 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు