వోల్వో ఎక్స్‌సీ–90@ రూ.1.42 కోట్లు

4 Sep, 2019 10:27 IST|Sakshi

 కేవలం 15 కార్లు మాత్రమే విక్రయం

ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన ఆల్ట్రా–లగ్జరీ హైబ్రీడ్‌ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌సీ–90’ పేరుతో విడుదలైన ఈ త్రీ–సీటర్‌ కారు ధర రూ. 1.42 కోట్లుగా ప్రకటించింది. వచ్చే ఏడాదికాలంలో కేవలం 15 కార్లను మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు వోల్వో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ వెల్లడించారు. ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే ఈకారును విక్రయిస్తున్నప్పటికీ.. కంపెనీకి ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ధీమా వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు