వెరైటీ ఫీచర్లతో.. వీయు ప్రీమియం 4కె టీవీ..

13 Mar, 2020 09:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:టీవీల ఉత్పత్తికి పేరొందిన వీయు టెలివిజన్‌ ఆధునిక టెక్నాలజీతో వీయు ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా వియు టెలివిజన్‌ సీఈఓ దేవిత సరఫ్‌ మాట్లడుతూ.. ఈ ప్రీమియం 4కె టీవీలో అత్యున్నత శ్రేణి ఫీచర్స్‌ను జోడించి, నూతన హంగులతో డిజైన్‌ చేశారు. దీన్ని 3 విభిన్న పరిమాణాల్లో (43, 50, 55 అంగుళాలు) çతయారు చేశామని, ఆండ్రాయిడ్‌ 9.0 సాంకేతికతతో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌తో రూపొందించామని తెలిపారు.  

డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఫ్రీడెమో
కెల్లీ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న అమీర్‌పేట్‌లో డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఉచిత డెమోను ఇవ్వనున్నారు. ఇందులో డిజిటల్‌ మార్కెటింగ్‌లో భాగమైన ఎస్‌ఈఓ, ఎస్‌ఎమ్‌ఏ, ఎస్‌ఈఎమ్‌ తదితర అంశాలపైన అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

స్వాద్‌ అప్నేపన్‌ కా...
సాక్షి, సిటీబ్యూరో: ట్రాన్స్‌ జెండర్ల సమస్యలపై మానవతా దృక్పథంతో ఆలోచించాలనే సందేశంతో రూపొందించిన స్వాద్‌ అప్నేపన్‌ కా క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు బ్రూక్‌ బాండ్‌ రెడ్‌ లేబుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఒక్కరినీ ఆదరించాలనే ఆలోచనను కలిగించాలనే ఈ ప్రచార చిత్రం రూపకల్పన చేశామని, మనసున్న ప్రతి ఒక్కరికీ ఇది స్పందనలు కలిగిస్తుందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.  

మరిన్ని వార్తలు