శంషాబాద్‌లో వీజ్‌మన్‌  ఫారెక్స్‌ కేంద్రాలు 

19 Jul, 2018 01:35 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల్లో ఉన్న వీజ్‌మన్‌ ఫారెక్స్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు ఈ కౌంటర్లను కంపెనీ నిర్వహించనుంది. విదేశీ కరెన్సీ, ప్రీపెయిడ్‌ ఫారెన్‌ కరెన్సీ కార్డ్స్, ట్రావెలర్స్‌ చెక్కులు ఇక్కడ లభ్యమవుతాయని వీజ్‌మన్‌ ఎండీ బి.కార్తికేయన్‌ తెలిపారు.    

>
మరిన్ని వార్తలు