200 కోట్లకు వాట్సాప్‌ యూజర్ల సంఖ్య

13 Feb, 2020 06:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది.  గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు