మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు

1 May, 2015 01:13 IST|Sakshi
మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు

శాన్ ఫ్రాన్సిస్కో: క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థకు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. రాబోయే రోజుల్లో మొబైల్ , క్లౌడ్ కంప్యూటింగ్‌కి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వివరించారు. బిల్డ్ 2015 కాన్ఫరెన్స్‌లో భాగంగా జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కస్టమర్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకోవడంలో గణనీయంగా తోడ్పాటు అందించడమే తమ లక్ష్యమని సత్య నాదెళ్ల వివరించారు.

మరిన్ని వార్తలు