భారత్ లో ‘మహిళా కార్పొరేట్ డెరైక్టర్ల గ్రూప్’ శాఖలు

15 Mar, 2016 01:43 IST|Sakshi
భారత్ లో ‘మహిళా కార్పొరేట్ డెరైక్టర్ల గ్రూప్’ శాఖలు

ముంబై: కంపెనీల బోర్డుల్లోని మహిళా డెరైక్టర్ల గ్రూప్ (డబ్ల్యూసీడీ) తాజాగా భారత్‌లో అడుగుపెట్టింది. డబ్ల్యూసీడీఇండియా పేరిట ముంబై, ఢిల్లీలో తమ చాప్టర్స్ ప్రారంభించింది. ప్రస్తుత, కాబోయే మహిళా కార్పొరేట్ డెరైక్టర్లకు ఇది నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడగలదని డబ్ల్యూసీడీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూసీడీకి 70పైగా చాప్టర్లు ఉండగా, వచ్చే ఏడాది కాలంలో మరో ఏడు చాప్టర్లు ప్రారంభించనుంది. ఇందులో 3,500 మంది పైగా సభ్యులు ఉన్నారు. వీరు 7,000 పైచిలుకు బోర్డుల్లో డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు