ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివల్‌: బిగ్‌ డిస్కౌంట్స్‌

3 Apr, 2018 17:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి మరోసారి  ఫాన్స్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. 2018ఎంఐ ఫాన్స్‌ ఫెస్టివల్‌ పేరుతో స్పెషల్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ఏప్రిల్‌ 5నుంచి 6 వరకు ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది.  ఎంఐ టీవీలు, ఎంఐ మిక్స్ 2, రెడ్‌మి నోట్ 5 ప్రో, రెడ్‌మి 5 లాంటి ఇతర ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు  ఎంఐ ఫాన్స్‌ కు రూ. 40 లక్షలు అంతకన్నా ఎక్కువ విలువైన ఎంఐ కూపన్లను అందిస్తోంది.

ఫాన్ ఫెస్టివల్‌పై సోషల్‌మీడియాలో ప్రచారం నిర్వహించనున్నట్లు షావోమి ప్రకటించింది. దీని ద్వారా కూడా యూజర్లకు డిస్కౌంట్లను  అందిస్తోంది.  సోషల్ మీడియా యూజర్లు  వారి స్నేహితులను ఆహ్వానిం చడంతో పాటు, నిర్దిష్ట లైక్స్‌ను పొందితే రెడ్‌మి నోట్‌ 5,  వై1,  బ్యాండ్ 2 లాంటి బహుమతులను ఉచితంగా గెలుచుకునే అవకాశం.  ఇందులో గ్రూప్‌గా కూడా కూపన్లు గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ  కూపన్లు ఏప్రిల్ 4 న ప్రారంభమవుతాయి.

మరోవైపు అమ్మకాల సమయంలో ఆఫర‍్లపై పూర్తి స్పష్టత లేనప్పటికీ..ఎంఐ మిక్స్2, ఎంఐ మాక్స్ 2, రెడ్‌మి 4, రెడ్‌మి వై1, రెడ్‌మి వై1లైట్ , రెడ్‌మి 5ఏ వంటి స్మార్ట్‌ఫోన్లపై రూ.3వేల వరకు తగ్గింపు ఇవ్వనుందని తెలుస్తోంది.  ఇవే కాకుండా ఎంఐ యాప్‌లో   "క్రేజీ కాంబోస్" ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా షావోమి స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలపై  ఈ  కాంబో ఆఫర్‌ ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 2 నుంచి 6 వరకు షావోమి 'కలర్ అవర్ ప్లానెట్' ప్రచారాన్ని  చేపట్టింది. ఇందులో విజేతలు రెడ్‌మి 5ఏ గెలుచుకునే అవకాశం. మరిన్ని వివరాలు ఎంఐ స్టోర్‌ యాప్‌లో లభ్యం. 

మరిన్ని వార్తలు